ఇజ్రాయెల్, హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధంలో ఇటీవల కాల్పుల విరమణ ప్రకటించి బంధీలను విడుదల చేసిన విషయం తెలిసిందే. కానీ ఆ తర్వాత మళ్లీ కాల్పులు చెలరేగాయి. అయితే తాజాగా గాజాలో ఇజ్రాయెల్ చేస్తున్న దాడులను ఆపాలని ఐక్యరాజ్య సమితిలో ఈఏఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా.. అమెరికా తన వీటో అధికారాన్ని వినియోగించి దీన్ని తిరస్కరించింది. దీంతో ఇజ్రాయెల్ దళాలు గాజాపై తమ దాడులను మరింత తీవ్రతరం చేశాయి. ఆదివారం ఉదయం దక్షణ గాజాలోని ఖాన్ యునిస్ నగరం నుంచి ఈజిప్టు సరిహద్దుల్లో రఫా నగరానికి వెళ్లే రహదారులను లక్ష్యంగా చేసుకొని బాంబు దాడులు జరిగినట్లు హమాస్ పేర్కొంది. ఆ ప్రాంతంలో దాడులు తీవ్రతరం కావడంతో.. ఆశ్రయం కోసం వేలాది మంది ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. మానవతా సాయం అందకపోతే అనేకమంది సామాన్య పౌరులు ఆకలి, ఇతర వ్యాధులతో చనిపోయే ప్రమాదం ఉందని అంతర్జాతీయ సహాయక బృందాలు ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేశాయి.
పూర్తిగా చదవండి..Gaza: గాజాలో దాడులు తీవ్రతరం చేసిన ఇజ్రాయెల్, పాలస్తీనా ప్రధానికి జైశంకర్ ఫోన్..
గాజాలో ఇజ్రాయెల్ జరుపుతున్న దాడులను ఆపాలని ఐక్యరాజ్యసమితిలో యూఏఈ తీర్మానం ప్రవేశపెట్టగా దీనికి అమెరికా తన వీటో అధికారాన్ని వినియోగించి అడ్డుకుంది. దీంతో గాజాలో ఇజ్రాయెల్ దాడులు మరింత తీవ్రతరం అయ్యాయి. దీంతో అక్కడ ఆశ్రయం కోసం వేలాది మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
Translate this News: