Telangana BJP Leaders: తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేలు సంచలన నిర్ణయం తీసుకున్నారు. తొలిరోజు అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించారు. శాసనసభలో ఇవాళ తాము ప్రమాణ స్వీకారం చేయబోమని స్పష్టం చేశారు కమలం పార్టీ ఎమ్మెల్యేలు. ప్రొటెం స్పీకర్గా అక్బరుద్దీన్ను ఎన్నుకోవడమే.. బీజేపీ నేతలు బహిష్కరణకు కారణంగా చెబుతున్నారు. అక్బరుద్దీన్ ఒవైసీ ముందు తాము ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేసే ముచ్చటే లేదని తేల్చి చెప్పారు బీజేపీ ప్రజా ప్రతినిథులు. ఈ మేరకు ఇవాళ పార్టీ కార్యాలయంలో జరిగిన బీజేఎల్పీ భేటీలో నిర్ణయించారు. బీజేఎల్పీ మీటింగ్కు ముందు.. ట్యాంక్ బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు బీజేపీ ఎమ్మెల్యేలు. అనంతరం అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించారు. అటు తరువాత పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు.
పూర్తిగా చదవండి..Telangana BJP: బీజేపీ సంచలన నిర్ణయం.. అసెంబ్లీ బహిష్కరణ.. కారణం ఆయనేనట..!
తెలంగాణ బీజేపీ నేతలు అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించారు. అక్బరుద్దీన్ను ప్రొటెం స్పీకర్గా నియమించడాన్ని వ్యతిరేకిస్తూ సభకు డుమ్మా కొట్టారు. అక్బరుద్దీన్ ముందు తాము ప్రమాణ స్వీకారం చేయలేమన్నారు. సీనియర్లను కాదని అక్బరుద్దీన్కు ప్రొటెం స్పీకర్గా అవకాశం ఇవ్వడాన్ని తప్పుపట్టారు.
Translate this News: