తెలంగాణలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశాక మరుసటిరోజే (శుక్రవారం) విద్యుత్ సంస్థల ఆర్థిక పరిస్థితి సమీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. కానీ ఈ సమావేశానికి ట్రాన్స్కో, జెన్కో సీఎండీగా ఉన్న డి.ప్రభాకరరావు రాకపోవడం చర్చనీయాంశమైంది. అయితే దీనిపై ప్రభాకర్రావు స్పందించారు. విద్యుత్శాఖ సమీక్షపై తనకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని అన్నారు. ముఖ్యమంత్రి పిలిస్తే ఎందుకు వెళ్లకుండా ఉంటానంటూ వ్యాఖ్యానించారు. విద్యుత్ శాఖ నుంచి గాని సీఎంవో కార్యాలయం నుంచి గాని తనకు ఎలాంటి ఆహ్వానం అందలేదని తెలిపారు. సీఎం పిలిస్తే కచ్చితంగా హాజరవుతానంటూ స్పష్టం చేశారు.
పూర్తిగా చదవండి..Telangana: అందుకే విద్యుత్శాఖ సమీక్షకు నేను వెళ్లలేదు.. సీఎండీ ప్రభాకర్ రావు సంచలన వ్యాఖ్యలు
సీఎం రేవంత్ రెడ్డి విద్యుత్శాఖ సమీక్ష నిర్వహించగా దీనికి రాకపోవడంపై ట్రాన్స్కో, జెన్కో సీఎండీ డి.ప్రభాకరరావు స్పందించారు. ఈ సమీక్షపై విద్యుత్ శాఖ నుంచి గాని సీఎంవో కార్యాలయం నుంచి గాని తనకు ఎలాంటి అందలేదని తెలిపారు. సీఎం పిలిస్తే ఎందుకు వెళ్లనని వ్యాఖ్యానించారు.
Translate this News: