తెలంగాణలో కొత్త సర్కారు కొలువుదీరింది. సీఎం రేవంత్ రెడ్డితో (CM Revanth Reddy) పాటు మరో 11 మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఆరు గ్యారంటీల అమలుపై రేవంత్ రెడ్డి (Revanth Reddy) తొలి సంతకం చేశారు. దివ్యాంగురాలు రజినికి ఉద్యోగ నియామక ఫైలుపై రెండో సంతకం చేశారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నేరవేర్చే ఇందిరమ్మ రాజ్యం వచ్చిందన్నారు. ఈ రోజు నుంచి తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ వచ్చిందన్నారు. కాంగ్రెస్ పార్టీ సమిధలా మారి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందన్నారు రేవంత్ రెడ్డి. ప్రగతి భవన్ ముందు ఉన్న ఇనుప కంచెలను బద్దలు కొట్టించామన్నారు.
ఇది కూడా చదవండి: సీఎం రేవంత్ కు మోడీ, హరీష్ రావు, లోకేష్ శుభాకాంక్షలు
తెలంగాణలో కొలువుదీరిన కొత్త సర్కార్.. నేడు సాయంత్రం 5 గంటలకు కేబినెట్ భేటీ!
తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాలన ప్రారంభమైంది. ముఖ్యమత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే రేవంత్ రెడ్డి 6 హామీల అమలుతో పాటు దివ్యాంగురాలు
Translate this News: