ఇంటర్ పూర్తవ్వగానే బీటెక్ చేసి అమెరికాలో ఎంఎస్ చేయలని ప్లాన్ చేస్తున్న విద్యార్థులకు గుడ్ న్యూస్. ఇంటిగ్రేటెడ్ డ్యయల్ డిగ్రీకోర్సు పేరుతో జేఎన్టీయూ వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఓ సరికొత్త ప్రోగ్రామ్ ను అందుబాటులోకి తీసుకువస్తుంది. ఈ కోర్సులో చేరిన విద్యార్థులు 5ఏళ్ల వ్యవధిలోనే బీటెక్, ఎంఎస్ పూర్తి చేసుకోవచ్చు. అది కూడా అమెరికాలో చదువు కంప్లీట్ చేసి పట్టా పొందవచ్చు. సాధారణంగా బీటెక్ చేసి ఎంఎష్ చేసేందుకు కనీసం 6 సంవత్సరాల సమయం పడుతుంది. కానీ ఐదు సంవత్సరాల్లోనే పూర్తయ్యే డ్యుయల్ డిగ్రీ కోర్సులో భాగంగా విద్యార్థులు 3ఏళ్లు జేఎన్టీయులో, రెండేళ్లు అమెరికాలో చదువుకోవల్సి ఉంటుంది. దీనికోసం అమెరికాలోని స్టీవెన్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, న్యూజెర్సీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, యూనివర్సిటీ ఆఫ్ అలబామా, మిల్వాకీ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్, లారెన్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వంటి యూనివర్సిటీలతో జెఎన్టీయూ ఇప్పటికే అవగాహన ఒప్పందం చేసుకుంది.
పూర్తిగా చదవండి..JNTU: ఇక ఐదేళ్లలోనే బీటెక్, ఎంటెక్.. జేఎన్టీయూ కీలక నిర్ణయం..!!
ఇంటర్ పూర్తి చేయగానే..ఇంటిగ్రేటెడ్ డ్యుయల్ డిగ్రీ కోర్సు పేరిట JNTUవచ్చేఏడాది నుంచి ఓ కొత్త ప్రోగ్రామ్ ను అందుబాటులోకి తీసుకువస్తుంది. ఈకోర్సులో చేరిన విద్యార్థులు 5ఏళ్ల వ్యవధిలో బీటెక్, ఎంఎస్ పూర్తి చేయవచ్చు. అది కూడా అమెరికాలో పట్టా పొందవచ్చు.
Translate this News: