Telangana CM Revanth Reddy: తెలంగాణ కాబోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన లేఖ రాశారు. రేవంత్రెడ్డికి శుభాకాంక్షలు చెబుతూ బహిరంగ లేఖ రాశారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్పై నమ్మకం పెట్టుకున్నారని, దాన్ని ఒమ్ము చేయకుండా వారి ఆకాంక్షను నేరవేర్చడం ఒక్క ఇందిరమ్మ రాజ్యంలోనే సాధ్యమని పేర్కొన్నారు. సోనియాగాంధీకి తెలంగాణ ప్రజలు ఇచ్చిన జన్మదిన కానుక అని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి సర్వ శక్తులు ఒడ్డిన.. రాహుల్, ప్రియాంక, ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే తదితర నేతలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. తెలంగాణ పోరాట గడ్డపై కాంగ్రెస్ కొత్త శకాన్ని ప్రారంభించబోతోందన్నారు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి బహుమతిగా.. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడానికి పీసీసీ ప్రెసిడెంట్గా సారథ్యం వహించి, నేడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఎంపికవడం హర్షణీయం అని పేర్కొన్నారు రేవంత్ రెడ్డి. అందుకే సోదరుడు రేవంత్ రెడ్డి తన అభినందనలు, శుభాకాంక్షలు అని తెలియజేశారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.
పూర్తిగా చదవండి..Telangana: ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన లేఖ.. ఏం రాశారంటే..
తెలంగాణ కాబోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన లేఖ రాశారు. రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. అదే సమయంలో కాంగ్రెస్పై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయకూడదన్నారు. ప్రజల ఆకాంక్షలు నేరవేర్చడం ఇందిరమ్మ రాజ్యంలోనే సాధ్యమన్నారు.
Translate this News: