Ambati Rambabu: తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ(TDP) దూరంగా ఉన్నప్పటికీ.. కాంగ్రెస్(Congress) కు పరోక్షంగా మద్దతును ప్రకటించిన సంగతి తెలిసిందే. మరోవైపు, అటు ఏపీలో టీడీపీతో పొత్తు పెట్టుకున్న జనసేన పార్టీ (Janasena) తెలంగాణలో బీజేపీ(BJp)తో కలిసి పోటీ చేసింది. అయితే, టీడీపీ జనసేన పార్టీ పొత్తులు అనైతికం అంటూ వైసీపీ మంత్రులు, వైసీపీ ఎంపీలు వరుసగా విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా, వైసీపీ మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu) టీడీపీ జనసేనపై సోషల్ మీడియాలో తీవ్ర స్ధాయిలో ధ్వజమెత్తారు. ఏపీలో టీడీపీ కార్యాలయానికి జనసేన జెండాలు.. గాంధీభవన్ వద్ద టీడీపీ జెండాలు కట్టారని.. ఈ పార్టీల వాళ్లు సిగ్గూ శరం లేనోళ్లని విరుచుకుపడ్డారు.
పూర్తిగా చదవండి..సిగ్గు – శరం..లేనోళ్లు..! మంత్రి అంబటి ఘాటు వ్యాఖ్యలు
టీడీపీ జనసేన పార్టీలపై ఏపీ మంత్రి అంబటి రాంబాబు మరోసారి మండిపడ్డారు. తెలంగాణలో గాంధీభవన్ వద్ద టీడీపీ జెండాలు.. ఏపీలో టీడీపీ కార్యాలయానికి జనసేన జెండాలు కట్టారని.. ఈ పార్టీల వారు సిగ్గు - శరం లేనోళ్లని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Translate this News: