నాగార్జునసాగర్ డ్యామ్ వద్ద ఏపీ, తెలంగాణ పోలీసుల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు రెండు రాష్ట్రాల్లో చర్చనీయాంశమయ్యాయి. అయితే దీనిపై తాజాగా శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఎన్నికల పోలింగ్ జరుగుతున్న వేళ.. సాగర్ డ్యామ్ పైకి ఆంధ్రప్రదేశ్ పోలీసులు దౌర్జన్యంగా వచ్చారని మండిపడ్డారు. దురాలోచనతోనే ఏపీ ప్రభుత్వం ఇలాంటి దుశ్చర్యకు పాల్పడిందంటూ ఆరోపణలు చేశారు. ఇష్టానుసారంగా వ్యవహరిస్తే.. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సంబంధాలు దెబ్బతింటాయని పేర్కొన్నారు. అలాగే మళ్లీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాబోతుందంటూ ఆశాభావం వ్యక్తం చేశారు.
పూర్తిగా చదవండి..Nagarjuna Sagar Dam: దురాలోచనతోనే ఏపీ ప్రభుత్వం దుశ్చర్య.. గుత్తా సంచలన వ్యాఖ్యలు..
నాగార్జున సాగర్ డ్యామ్ నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ.. డ్యామ్ పైకి ఏపీ పోలీసులు దౌర్జన్యంగా తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వచ్చారని మండిపడ్డారు. దురాలోచనతోనే ఏపీ ప్రభుత్వం ఇలాంటి దుశ్చర్యకు పాల్పడిందంటూ ఆరోపణలు చేశారు.
Translate this News: