ఇటీవల ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీలో నిర్మాణంలో ఉన్న సొరంగం కుప్పకూలిన సంగతి తెలిసిందే. అందులో చిక్కుకున్న 41 మంది కూలీలను సహాయక సిబ్బంది దాదాపు 17 రోజుల పాటు తీవ్రంగా శ్రమించి ఎట్టకేలకు వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. అయితే ఇప్పుడు ఉత్తరకాశీ జిల్లాలో మరో సొరంగం అక్కడి స్థానికులను భయపెడుతోంది. ఈ సొరంగం నుంచి భారీగా నీరు వస్తుంది. ఈ నీటి ప్రభావానికి కాలువలు, పంట భూములు దెబ్బతిన్నాయని అక్కడివారు వాపోతున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. మనేరీ భళి-2 అనే ప్రాజెక్టులో 16 కిలోమీటర్ల వరకు పొడవైన సొరంగం ఉంది. ఈ సొరంగం గుండా నీరు ప్రవహిస్తోంది. ధారసు అనే ప్రాంతంలో విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ధారసు సమీపంలో ఉన్న మహర్గావ్లోని సొరంగం నుంచి రెండేళ్ల క్రితం నీటి లికేజీ మొదలైంది.
పూర్తిగా చదవండి..ఉత్తరకాశీలో భయపెడుతున్న మరో సొరంగం.. దెబ్బతిన్న పంటలు, కాలువలు
ఉత్తరకాశీ జిల్లాలో మరో సొరంగం స్థానికులను కలవరపెడుతోంది. నేరీ భళి-2 అనే ప్రాజెక్టులో 16 కిలోమీటర్ల పొడవైన సొరంగం నుంచి నీరు లికేజీ అవుతోంది. దీంతో కాలువలు పంట భూములు దెబ్బతిన్నాయి. ఈ సమస్యను పరిష్కరిస్తామని అధికారులు చెబుతున్నారు.
Translate this News: