తెలంగాణ రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసినట్లు ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలిపారు. ఓట్ల లెక్కింపునకు సంబంధించి ఏర్పాట్లన్నీ చకచకా జరుగుతున్నట్లు చెప్పారు. హైదరాబాద్ లోని బీఆర్కే భవన్ లో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడి ఈ వివరాలను వెల్లడించారు. 119 అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు కోసం 49కేంద్రాలను ఎంపిక చేసినట్లు చెప్పారు. 2018 ఎన్నికలతో పోల్చితే ఓటింగ్ శాతం స్వల్పంగా తగ్గిందన్నారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల దగ్గర మూడెంచల భద్రతను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. 113 నియోజకవర్గాలకు సంబంధించి ఓట్ల లెక్కింపు 14 టేబుళ్ల ద్వారా జరుగుతుందన్నారు. 500లకుపైగా పోలింగ్ కేంద్రాలు ఉన్న 6 నియోజకవర్గాల్లో 28 టేబుళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు.
పూర్తిగా చదవండి..TS Elections Counting: రేపు ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్.. ఆ తర్వాతే ఫలితాల ప్రకటన..!!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు కౌంట్ డౌన్ షురూ అయ్యింది. ఓటింగ్ కు సంబంధించిన ఏర్పాట్లన్నీ ముమ్మరంగా సాగుతున్నట్లు ఎన్నికల అధికారి వికాస్ రాజ్ తెలిపారు. ఉదయం 8గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం అవుతుందని..సాయంత్రం 5గంటలకు ఫలితాలను వెల్లడిస్తామని తెలిపారు.
Translate this News: