EC Declares Holiday: గురువారం తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ నేపధ్యంలో రాష్ట్రంలోని అన్ని సంస్థలు, కంపెనీలు తప్పనిసరిగా సెలవు ప్రకటించాలని ఎన్నికల కమిషన్ (Election Commission) ఆదేశించింది. ఉద్యోగులు ఓటింగ్ లో పాల్గొంనేందుకు నవంబర్ 30న (November 30) సెలవుదినంగా ప్రకటించాలని సూచించింది. లేని పక్షంలో కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను సీఈవో వికాస్ రాజ్ విడుదల చేశారు. ఈ క్రమంలోనే గత ఎన్నికల టైంలో కొన్ని సంస్థలు సెలవు ఇవ్వనట్లుగా ఫిర్యాదులు వచ్చాయన్నారు. ఈ మేరకు ఈ ఎన్నికలకు అన్ని సంస్థలు సెలవు ఇచ్చాయో ..లేదో పరిశీలించాలని కార్మిక శాఖకు వికాస్ రాజ్ (Vikas Raj) ఆదేశాలు జారీ చేశారు.
పూర్తిగా చదవండి..నవంబర్ 30న సెలవు ఇవాల్సిందే..ఈసీ హెచ్చరిక.!
అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో నవంబర్ 30న సెలవుదినంగా ప్రకటించాలని సీఈవో వికాస్ రాజ్ సూచించారు. రాష్ట్రంలోని అన్ని సంస్థలు, కంపెనీలు తప్పనిసరిగా సెలవు ప్రకటించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలోనే బుధ, గురువారాల్లో రాష్ట్ర ప్రభుత్వం విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది.
Translate this News: