Telangana Elections Survey Reports: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కీలక ఘట్టమైన ప్రచార పర్వం కూడా ముగియనుంది. చివరి రోజు ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థులు తమ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. రోడ్ షో లతో హడావుడి చేస్తున్నారు. మరొక్క రోజు గడిస్తే.. ఏ పార్టీ భవితవ్యం ఏంటనేది ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంటుంది. డిసెంబర్ 3న ఇక తెలంగాణను ఏలేది ఏ పార్టీ అనేది తేలిపోతుంది. ఓటర్లు ఎవరిని దీవిస్తారు? ఎవరికి పట్టం కడతారు? అనే అంశంపై ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు రాజకీయ నేతలు. అయితే, అంతకంటే ముందుగానే.. జనం నాడి ఏంటి? ప్రజలు ఎవరి వైపు ఉన్నారు? ఏ పార్టీకి అధికారం కట్టబెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు? అనే అంశాన్ని తేల్చేందుకు అనేక సంస్థలు సర్వేలు నిర్వహించాయి. ప్రజల మూడ్ ఏంటో తెలుసుకున్నాయి. వారు ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారో నిర్ధారించాయి. వీటిలో ప్రధానంగా ఏబీపీ-సీఓటర్ సర్వే, డెమోక్రసీ టైమ్స్ నెట్వర్క్, జనతా కా మూడ్, సౌత్ ఫస్ట్, సీ నెక్ట్స్ సర్వే, రాజ్నీతి, ఆత్మసాక్షి, లోక్పోల్, ఇండియాటీవీ-సీఎన్ఎక్స్, మిషన్ చాణక్య సర్వేలన్నీ తమ ప్రీ పోల్ సర్వే రిపోర్ట్ను విడుదల చేశాయి. ఈ సర్వేలు తెలంగాణలో ఏ పార్టీ అధికారంలోకి రానుందో లెక్కలతో సమా వివరాలను వెల్లడించాయి. మరి ఆ వివరాలేంటో ఓసారి చూద్దాం..
పూర్తిగా చదవండి..Telangana Elections: ముగిసిన తెలంగాణ ఎన్నికల ప్రచార పర్వం.. ఇప్పటివరకు సర్వేల లెక్కలివే!
తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ఎలక్షన్ సర్వే సంస్థలు ప్రీ పోల్ సర్వే రిపోర్ట్స్ను వెల్లడించాయి. మెజార్టీ సంస్థలు బీఆర్ఎస్ పార్టీదే అధికారం అని చెబుతున్నారు. కాంగ్రెస్ భారీ మెజార్టీతో గెలుస్తుందని కొన్ని సంస్థలు చెబుతున్నారు. అధికారం ఏ పార్టీదో తేలాలంటే డిసెంబర్ 3 వరకు ఆగాల్సిందే.
Translate this News: