ఉత్తరాఖండ్ సిల్ క్యారా సొరంగంలో 41 మంది కార్మికులు చిక్కుకుని ఇప్పటికి 14పైన రోజులు గడుస్తోంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా కార్మికులను బయటకు తీసుకురాలేకపోయారు. ఇప్పటి వరకు శిథిలాలను తవ్వి వారిని బయటకు తీసుకురావడానికి ప్రయత్నించారు. కానీ అది సాధ్యపడలేదు. దాంతో ఇప్పుడు టన్నెల్ మీద ఉన్న కొండ మీద నుంచి లోపలికి వెళ్ళడానికి ట్రై చేస్తున్నారు. నిన్న మధ్యాహ్నం నుంచి నిట్టనిలువుగా డ్రిల్లింగ్ చేయడం మొదలుపెట్టారు. మొత్తం 86 మీటర్లలో 20 మీటర్లకు పైగా డ్రిల్లింగ్ చేశారు. భారీ బండలు లాంటివి అడ్డుపడకపోతే నవంబర్ 30వ తేదీకల్లా డ్రిల్లింగ్ పూర్తి అయ్యే అవకాశ ముంది. 85 మీటర్ల వరకు డ్రిల్లింగ్ చేశాక సొరంగం పైకప్పుకు చేసిన కాంక్రీట్, ఉక్కు రాడ్ల నిర్మాణాన్ని పగులగొట్టి మార్గం ఏర్పరచాలని ఎన్డీఎంఏ సభ్యుడు మాజీ లెఫ్టినెంట్ జనరల్ సయ్యద్ అతా హస్నాయిన్ చెప్పారు.
పూర్తిగా చదవండి..Uttarakhnad:నిలువుగా డ్రిల్లింగ్ మొదలు..నెలఖారుకు కార్మికులు బయటకు వచ్చే ఛాన్స్
ఉత్తరాఖండ్ లో సిల్ క్యారా టన్నెల్ లో చిక్కుకున్న కార్మికులను బయటకు తీసుకువచ్చేందుకు సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటివరకూ శిథిలాల నుంచి సమాంతరంగా చేసిన డ్రిల్లింగ్ పనులను ఇప్పుడు నిట్టనిలువుగా చేస్తున్నారు. టన్నెల్ పైనున్న కొండ మీద నుంచి కిందకు తవ్వుతున్నారు.
Translate this News: