ఆరుసార్లు విశ్వవిజేతలే కావచ్చు…టీమ్ ఎఫర్ట్ తో వరల్డ్ కప్ ను సొంతం చేసుకోవచ్చు. దీనికి అందరూ వాళ్ళను మెచ్చుకున్నారు. టీమ్ ఇండియాను భారత్ లోనే ఓడించినా ఎవ్వరూ ఒక్క మాట అనలేదు సరికదా..చాలా బాగా పొగిడారు కూడా. కానీ వాళ్ళకు మాత్రం గర్వం బాగా నెత్తికెక్కింది. వరల్డ్ కప్ గెలిచిన దగ్గర నుంచీ ఏదొ ఒకటి చేస్తూనే ఉన్నారు. వరల్డ్కప్ ట్రోఫీ మీద కాళ్లు వేసి మిచెల్ మార్ష్ ఇచ్చిన ఫోజు ఇంకా మరిచిపోకముందే.. టీమిండియా క్రికెటర్లను అవమానించేలా ఆసీస్ క్రికెటర్లు మరో పనిచేశారు. ఫైనల్లో కంగారూలు గెలిచిన తర్వాత భారత క్రికెటర్లను అవమానించేలా ఆస్ట్రేలియా మీడియా సంస్థ ఒకటి ఓ పోస్ట్ చేసింది. దానికి ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్, ఆల్రౌండర్ మ్యాక్స్వెల్, ఆరోన్ ఫించ్ వంటి క్రికెటర్లు లైక్ కొట్టడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
పూర్తిగా చదవండి..Cricket:మరీ ఇంత గర్వం పనికిరాదు కంగారూలూ..
ప్రపంచ కప్ ఫైనల్ లో అద్భుతమైన ప్రదర్శనతో కప్ ను సొంతం చేసుకున్నారు. కానీ దాని తర్వాత వారి ప్రవర్తనే అస్సలు బాలేదు. మొన్న కప్ మీద కాళ్ళు పెట్టాడు మిచెల్ ఇప్పుడు టీమ్ ఇండియాను అవమానిస్తూ పెట్టిన పోస్ట్ కు కమిన్స్, మాక్స్ లైక్ లు కొట్టారు.
Translate this News: