తెలంగాణలో ఎన్నికలు (Telangana Elections 2023) సమీపిస్తున్నా కొద్దీ రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. నామినేషన్ల ఉపసంహరణ తర్వాత కూడా వలసలు ఆగిపోవడం లేదు. ఒక పార్టీ నుంచి మరో పార్టీకి జంపింగ్ లు కొనసాగుతూనే ఉన్నాయి. టికెట్ దక్కకపోవడంతో ఈ రోజు అలంపూర్ అభ్యర్థి అబ్రహం బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమయ్యారు. మరో వైపు పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి కాట శ్రీనివాస్ గౌడ్ కు (Kata Srinivas Goud) సొంత సోదరుడు షాక్ ఇచ్చారు. ఆయన అన్న, వదిన ఈ రోజు బీఆర్ఎస్ గూటికి చేరారు. మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) వీరిద్దరికీ ఈ రోజు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పటాన్ చెరులో బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి కాట శ్రీనివాస్ గౌడ్, బీజేపీ నుంచి నందీశ్వర్ గౌడ్ బరిలో ఉన్నారు.
ఇది కూడా చదవండి: Breaking News: కాంగ్రెస్ అభ్యర్థి మనోహర్ రెడ్డి ఫ్యాక్టరీలో ఐటీ దాడులు
పటాన్చెరులో కాంగ్రెస్ అభ్యర్థి కాట శ్రీనివాస్ గౌడ్ కు బిగ్ షాక్
పటాన్చెరులో కాంగ్రెస్కు బిగ్ షాక్ తగిలింది. కాంగ్రెస్ అభ్యర్థి కాట శ్రీనివాస్ గౌడ్ సోదరుడు, వదిన బీఆర్ఎస్ లో చేరారు. మంత్రి హరీశ్ రావు వీరికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
Translate this News: