ప్రస్తుతం రాజకీయాల్లో దూకుడు ప్రదర్శిస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో పర్యటన చేస్తున్నారు. తాజాగా కొత్త గూడెం జనసేన అభ్యర్థి సురేంద్రరావుకు మద్దతుగా పవన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఉద్యమ పోరాట స్పూర్తితోనే ఆంధ్రప్రదేశ్లో రౌడీలు, గుండాలను ఎదుర్కొంటున్నానని అన్నారు. ఇదే నా ఇజమని.. హ్యూమనిజమని పేర్కొన్నాకు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని దాశరథి కృష్ణమాచార్యులనే తాను స్పూర్తిగా తీసుకున్నానని తెలిపారు. ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ బీజేపీతో కలిసి ఎన్నికలో బరిలో నిలిచిందని.. కొత్తగా ఏర్పాటైన రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే జనసేన మద్దతులో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కావాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు.
పూర్తిగా చదవండి..Telangana Elections: తెలంగాణ స్పూర్తితోనే ఏపీలో గుండాలను, రౌడీలను ఎదుర్కొంటున్నా: పవన్ కళ్యాణ్
తెలంగాణ ఉద్యమ పోరాట స్పూర్తితోనే ఏపీలో రౌడీలు, గుండాలను ఎదుర్కొంటున్నానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. కొత్త రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే జనసేన మద్దతుతో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. బీజేపీకి జనసైనికులు వారికి మద్దతివ్వాలని కోరారు.
Translate this News: