Special Trains for Sabarimala: శబరిమల ద్వారాలు తెరుచుకున్న నేపథ్యంలో అయ్యప్ప(Ayyappa Swamy)ను దర్శించుకునేందుకు దేశ వ్యాప్తంగా భక్తులు పోటెత్తుతున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి శబరికి(Sabarimala) వెళ్లే భక్తుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే మరికొన్ని ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తోంది. భక్తుల సౌకర్యార్థం మరో 64 ప్రత్యేక రైళ్లు నడపునున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఒక ప్రకటక విడుదల చేసింది దక్షిణ మధ్య రైల్వే. దీని ప్రకారం.. శబరిమల వెళ్లేందుకు సికింద్రాబాద్-కొల్లం మధ్య డిసెంబర్ 10, 17, 24, 31 తేదీల్లో, జనవరి 9, 14 తేదీల్లో ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. అలాగే నర్సాపూర్-కొట్టాయం మధ్య డిసెంబర్ 10, 17, 24, 31 తేదీల్లో, జనవరి 7, 4 తేదీల్లో ఈ ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి.
పూర్తిగా చదవండి..Sabarimala Special Trains: శబరిమలకు మరో 64 ప్రత్యేక రైళ్లు.. షెడ్యూల్ వివరాలివే..
శబరిమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది దక్షిణ మధ్య రైల్వే. మరో 64 ప్రత్యేక రైళ్లును ఏర్పాటు చేసింది. సికింద్రాబాద్ - కొల్లం, నర్సాపూర్-కొట్టాయం, విశాఖపట్నం-కొల్లం, శ్రీకాకుళం రోడ్-కొల్లం మధ్య ఈ స్పెషల్ ట్రైన్స్ నడపనున్నారు.
Translate this News: