బీఆర్ఎస్, బీజేపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు..ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ. కొమురంభీం జిల్లా ఆసిఫాబాద్ నియోజకవర్గంలో ఏర్పటు చేసిన కాంగ్రెస్ సభలో ఆమె ప్రసంగించారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ రెండూ ఒక్కటేనని బీఆర్ఎస్ కు ఓటు వేస్తే బీజేపీకి ఓటు వేసినట్లే అన్నారు. ఈసారి కేసీఆర్,కేటీఆర్ లకు ఉద్యోగాలు ఇవ్వొదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీతోనే తెలంగాణ రాష్ట్రం డెవలప్ మెంట్ సాధ్యమవుతుందన్నారు. కేసీఆర్ 10ఏళ్ల పాలనలో ప్రజల సొమ్ముతో ప్రాజెక్టులు కట్టి కమిషన్ల కోసం స్కాంలు చేశారంటూ సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకే ఆనాడు సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇందిరాగాంధీ మరణించే వరకు కూడా ప్రతిక్షణం ప్రజల బాగోగుల గురించి మాత్రమే ఆలోచించేవారని ప్రియాంకగాంధీ అన్నారు. భూమిలేని నిరుపేదల కోసం 7లక్షల ఎకరాల భూమి ధారాతత్తం చేసింది ఇందిరాగాంధీనే అంటూ గుర్తు చేశారు.
పూర్తిగా చదవండి..Telangana Elections 2023: ఆ రెండు పార్టీలు ఒక్కటే..వాళ్లకు ఉద్యోగాలివ్వకండి: ప్రియాంకగాంధీ..!!
బీఆర్ఎస్, బీజేపీపై ఫైర్ అయ్యారు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ. కొమురంభీం జిల్లా ఆసిఫాబాద్ నియోజకవర్గంలో ఏర్పటు చేసిన కాంగ్రెస్ సభలో ఆమె ప్రసంగించారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ రెండూ ఒక్కటే అన్నారు. ఈసారి కేసీఆర్,కేటీఆర్ లకు ఉద్యోగాలు ఇవ్వొద్దంటూ మండిపడ్డారు.
Translate this News: