Telangana Elections 2023: మల్కాజిగిరి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి మైనంపల్లి హనుమంతరావు, మెదక్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి మైనంపల్లి రోహిత్కు చిక్కులు తప్పవా..? విలాసవంతమైన కార్లతో వారు చేసే హంగామానే.. వారికి ఇబ్బందులు తెచ్చిపెట్టనుందా? ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్న ఆస్తులు? బయట కనిపిస్తున్న విలాసాలకు పొంతన లేదని ఐటీ, ఈసీకి అందుతున్న ఫిర్యాదులతో వారిపై చర్యలు తప్పవా? అంటే అవుననే సమాధానం ఇస్తున్నాయి జరుగుతున్న పరిణామాలు. మైనంపల్లి హనుమంతరావు ఫ్యామిలీపై వరుస ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారంటూ వీరిపై ఐటీ, ఈసీకి ఫిర్యాదులు అందుతున్నాయి. ఇందే అంశంపై న్యాయవాది రాములు లోకాయుక్త, ఈసీ, ఐటీ అధికారులకు ఫిర్యాదులు చేశారు.
పూర్తిగా చదవండి..Telangana: మైనంపల్లికి అన్ని ఆస్తులున్నాయా? రంగంలోకి దిగిన ఈసీ.. విచారణకు ఆదేశం
మైనంపల్లి హనుమంతరావు ఆస్తులపై విచారణ జరిపించాలంటూ ప్రముఖ న్యాయవాది రామారావు లోకాయుక్తాలో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు నేపథ్యంలో తెలంగాణ ఎన్నికల సంఘం రంగంలోకి దిగింది. ఆరోపణలపై విచారణకు ఆదేశించింది.
Translate this News: