Telangana Elections: ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్ ఈరోజుమెదక్ లో పర్యటించారు. అక్కడ ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజాశీర్వాద సభలో మెదక్ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన మైనంపల్లి హనుమంతరావు కొడుకు మైనంపల్లి రోహిత్ రావుపై సెటైర్లు వేశారు సీఎం కేసీఆర్. మెదక్ లో పద్మ దేవేందర్ రెడ్డికి కాంగ్రెస్ అభ్యర్థికి ఎమన్నా పోలిక ఉందా? అని మెదక్ ప్రజలను ప్రశ్నించారు. ఎవర్నో దిష్టిబొమ్మ తెచ్చినట్లు తెచ్చి పద్మాదేవేందర్ రెడ్డి ముందు పెడితే.. మనం ఓడిపోవాలి.. కాంగ్రెస్ వాళ్లు గెలవాలన్న అని అన్నారు. మెదక్ లో బీఆర్ఎస్ అభ్యర్థి పద్మాదేవేందర్ రెడ్డిని భారీ మెజారితో గెలిపించాలని సీఎం కేసీఆర్ మెదక్ ప్రజలను విజ్ఞప్తి చేశారు.
పూర్తిగా చదవండి..CM KCR: మైనంపల్లి రోహిత్ ఓ దిష్టి బొమ్మ.. మెదక్ మీటింగ్ లో కేసీఆర్ సెటైర్లు!
మెదక్ పర్యటనలో సీఎం కేసీఆర్ కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లి రోహిత్ పై సెటైర్లు వేశారు. రోహిత్ ను దిష్టిబొమ్మతో పోల్చుతూ బీఆర్ఎస్ అభ్యర్థి పద్మాదేవేందర్ రెడ్డిని గెలిపించాలని మెదక్ ప్రజలను కోరారు.
Translate this News: