TS Elections: కేంద్రమంత్రి, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి (Kishan Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ (BJP) అధికారంలో రాగానే ముస్లిం రిజర్వేషన్లను (Muslim Reservation) రద్దు చేస్తామని అన్నారు. హై కోర్ట్ తీర్పుకు వ్యతిరేకంగా ఈ రిజర్వేషన్లను అమలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ రిజర్వేషన్ల వల్ల మత మార్పిడులకు ప్రోత్సహించేందుకు ఈ రిజర్వేషన్లు ఉన్నాయని కోర్టు తీర్పులో ఉందని ఉద్గాటించారు. ముస్లిం రిజర్వేషన్ బిల్లును రద్దు చేసి దాన్ని ఎస్సీ, ఎస్టీలకు దక్కేలా చూస్తామన్నారు. ప్రభుత్వం కొలువులు ఇవ్వడంలో బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వం విఫలమైందని అన్నారు. నిరుద్యోగులు ఆందోళన చెందవద్దని.. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే అరు నెలల్లో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. ఈసారి ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ప్రచారం బీజేపీ తరఫున ప్రచారం చేస్తారని తెలిపారు.
పూర్తిగా చదవండి..Kishan Reddy: ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తాం.. కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!
తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్స్ ను రద్దు చేస్తామని అన్నారు. అరు నెలల్లో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు.
Translate this News: