సూర్యాపేటలో కాంగ్రెస్ రెబల్ గా బరిలోకి దిగిన పటేల్ రమేష్ రెడ్డి (Patel Ramesh Reddy) తన నామినేషన్ ను ఉపసంహరించుకున్నారు. కాంగ్రెస్ నేతలు రోహిత్ చౌదరి, మల్లు రవి ఈ రోజు ఉదయం సూర్యాపేటలోని రమేష్ రెడ్డి నివాసానికి వెళ్లి చర్చలు జరిపాయి. దీంతో తాను పోటీలో నుంచి తప్పుకుంటున్నట్లు రమేష్ రెడ్డి ప్రకటించారు. కొద్ది సేపటి క్రితం నామినేషన్ ను ఉపసంహరించుకున్నారు. దామోదర్ రెడ్డికి మద్దతుగా ప్రచారం చేస్తానని ఆయన ప్రకటించారు. అయితే.. ఈ రోజు ఉదయం పటేల్ రమేష్ రెడ్డికి నివాసానికి వచ్చిన రోహిత్ చౌదరి, మల్లు రవిని కార్యకర్తలు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది.
ఇది కూడా చదవండి: నేను ఇంకా ఎంతకాలం కొట్లాడాలి.. బోధన్ సభలో కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు!
TS Elections 2023: నామినేషన్ ఉపసంహరించుకున్న పటేల్ రమేష్ రెడ్డి.. అధిష్టానం ఆ హామీ ఇచ్చిందని ప్రకటన!
సూర్యాపేటలో కాంగ్రెస్ రెబల్ గా బరిలోకి దిగిన పటేల్ రమేష్ రెడ్డి తన నామినేషన్ ను విత్ డ్రా చేసుకున్నారు. ఇలాంటి పరిస్థితి వస్తుందని తాను అనుకోలేదని ఆయన కన్నీరు పెట్టుకున్నారు. తనకు ఎంపీగా అవకాశం కల్పిస్తామని రేవంత్ రెడ్డితో పాటు అధిష్టానం పెద్దలు హామీ ఇచ్చినట్లు చెప్పారు.
Translate this News: