ఒక్కోసారి భలే విచిత్రమైన విషయాలు జరుగుతుంటాయి. బెంగళూరులో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ అధినేత కమారస్వామి మీద కేసు కూడా అలాంటిదే. ఇంతటి వ్యక్తి కరెంట్ దొంగతనం చేశారంటూ బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేశారు. దీపావళి సందర్భంగా బెంగళూరులోని తన ఇంటిని అలంకరించేందుకు తన ఇంటి పక్కనే వీధిలో ఉన్న ఓ స్తంభం నుంచి అక్రమంగా తీగలను వేసినట్లు బెస్కాం (బెంగళూరు విద్యుత్తు సరఫరా సంస్థ) అధికారులు గుర్తించారు. ఈ సంఘటనపై మంగళవారం బెస్కాం ఏఈఈ ప్రశాంత్ కుమార్ ఫిర్యాదు ఇచ్చారు. దీంతో పోలీసులు కుమారస్వామి మీద సెక్షన్ 135 కింద కేసును పెట్టారు. ఈ నేరం కనుక రుజువైతే మూడేళ్ళ జైలుశిక్ష లేదా జరిమానా ఉంటుంది.
పూర్తిగా చదవండి..Karnataka:కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామిపై కరెంట్ చోరీ కేసు
జేడీఎస్ అధినేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామిపై బెంగళూరులో విద్యుత్ చౌర్యం కేసు నమోదైంది. దీపావళి కోసం విద్యుల్ దీపాలను అలంకరించుకునేందుకు విద్యుత్ స్తంభం నుంచి కరెంట్ చోరీ చేశారని కేసు నమోదు చేసారు బెంగళూరు పోలీసులు.
Translate this News: