Children’s Day 2023: ప్రపంచంలో చాలా దేశాలు నవంబర్ 20వ తేదీన చిల్డ్రన్స్ డే చేసుకుంటాయి. ఒక్క భారతదేశంలో మాత్రమే నవంబర్ 14వ తేదీన బాలల దినోత్సవం నిర్వహించుకుంటారు. దీనికి కారణం భారత దేశానికి మొట్ట మొదటి ప్రధానమంత్రిగా పనిచేసిన జవహర్ లాల్ నెహ్రూ (Jawaharlal Nehru) పుట్టినరోజు ఈరోజు కావడం. స్వాతంత్ర పోరాటంలో పాల్గొనడమే కాక దేశానికి ప్రగతి బాటలు వేయడంలో కీలక పాత్ర పోషించిన జవహర్ లాల్ నెహ్రూ గుర్తుగా ఈరోజును పండుగలా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అంతే కాదు ఆయనకు చిన్నపిల్లలు అంటే కూడా చాలా ఇష్టం. దేశ పురోగతికి నేటి బాలలే పాటుపడతారని ఆయన బలంగా నమ్మారు. తెల్లని శాంతి కపోతంలా ఉండే నెహ్రూ కల్మషం లేని పిల్లలకు ఒక ప్రత్యేకమైన రోజు ఉండాలని భావించారు. అందుకే ఆయన తర్వాత ఆయన పుట్టినరోజును బాలల దినోత్సవంగా జరుపుకుంటున్నారు.
పూర్తిగా చదవండి..నేటి బాలలే రేపటి పౌరులు అని గుర్తు చేసే చిల్డ్రన్స్ డే.
నవంబర్ 14 వచ్చిందంటే చాలు పిల్లలు అందరూ ఎగిరి గంతేస్తారు. ఈ రోజు తమదే అంటూ ఆనందంలో మునిగిపోతారు. నేటి బాలలే రేపటి దేశ భవిష్యత్తు అని బలంగా నమ్మిన చాచా నెహ్రూ పుట్టిన రోజున ఈరోజు.
Translate this News: