TS Elections: తెలంగాణలో నామినేష్ల పర్వం ముగిసింది.. ప్రచారాల్లో నేతల జోష్ పెరిగింది. అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీల మధ్య విమర్శల దండకం తార స్థాయికి చేరుకుంది. తాజాగా తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై (Revanth Reddy) బీఆర్ఎస్ మంత్రి హరీష్ రావు (Harish Rao) సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో (Congress) టికెట్లను కోట్ల రూపాయలకు రేవంత్ రెడ్డి అమ్ముకున్నారని ఆరోపించారు. రేవంత్రెడ్డి రైతులను అవమానిస్తున్నారని అన్నారు. రైతుబంధు సొమ్మును భిక్షం అంటూ అవమానించారని పేర్కొన్నారు. రేవంత్రెడ్డికి వ్యవసాయంపై అవగాహన లేదని.. అందుకే రైతులకు మూడు గంటల కరెంట్ చాలని అంటున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు అడిగే అర్హత లేదని అన్నారు.
పూర్తిగా చదవండి..కర్ణాటకలో కాంగ్రెస్ తో పాటు కరువు కూడా వచ్చింది.. హరీష్ రావు సెటైర్లు!
కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత అక్కడ కరువు వచ్చిందని సెటైర్లు వేశారు మంత్రి హరీష్ రావు. సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణలో ఎక్కడా కరవు లేదని తెలిపారు. అలాగే రేవంత్ రెడ్డిపై విమర్శలు దాడి చేశారు మంత్రి హరీష్.
Translate this News: