Telangana Nominations: ఈ నెల 30న తెలంగాణలో ఎన్నికలు జరగనున్నాయి. రేపటితో నామినేషన్ల గడువు ముగియనుంది. దీంతో నామినేషన్లు వేసేందుకు మరో కొన్ని గంటల సమయం ఉండడంతో ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులందరూ నామినేషన్లు వేసేందుకు ఆర్వో ఆఫీసులకు పరుగులు తీస్తున్నారు. తాజాగా దుబ్బాకలో బీఆర్ఎస్(BRS) అభ్యర్థి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి(Kotha Prabhakar Reddy) నామినేషన్ దాఖలు చేశారు. అక్టోబర్ 30వ తేదీన ప్రచారంలో భాగంగా సిద్ధిపేట జిల్లా దుబ్బాకలో ప్రచారం చేస్తుండగా గుర్తి తెలియని వ్యక్తి ప్రభాకర్ను కత్తితో కడుపులో పొడిచిన సంగతి తెలిసింది. ప్రస్తుతం యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఇవాళ అంబులెన్స్లో వచ్చి దుబ్బాక ఆర్వో ఆఫీసులో నామినేషన్ దాఖలు చేశారు. దీనికి సంభందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పూర్తిగా చదవండి..Kotha Prabhakar Reddy: అంబులెన్సులో వచ్చి నామినేషన్ వేసిన కొత్త ప్రభాకర్ రెడ్డి!
తెలంగాణలో ఎన్నికల నామినేషన్ల గడువు రేపటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఎన్నికల ప్రచారంలో కత్తి పోటుకు గురైన ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఇవాళ అంబులెన్సులో వచ్చి దుబ్బాక ఆర్వో ఆఫీసులో నామినేషన్ వేశారు.
Translate this News: