Kavitha Will Be Arrested Soon: తెలంగాణ పర్యటనలో ఉన్న కేంద్ర మంత్రి అశ్విన్ కుమార్ చౌబే(Ashwini Kumar Choubey) సీఎం కేసీఆర్(CM KCR)పై సంచలన ఆరోపణలు చేశారు. కేసీఆర్ సర్కార్ లిక్కర్ స్కామ్, కరప్షన్ మీద పడిందని అన్నారు. ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్(CM Kejriwal)తో కలిసి సీఎం కేసీఆర్ ప్రజల సొమ్మును కాజేస్తున్నారని ఆరోపించారు. కేజ్రీవాల్, కేసీఆర్ ఇద్దరూ దొంగలే అని అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని నరకంగా మార్చారు అని అన్నారు. కేసీఆర్ బిడ్డ కవిత(Kavitha) లిక్కర్ స్కామ్లో ఇరుక్కుందని పేర్కొన్నారు. ఇవ్వాళో, రేపో.. ఆమెకు శిక్ష పడటం ఖాయమని సంచలన వ్యాఖ్యలు చేశారు. కవిత జైలుకు వెళ్లాడాన్ని ఎవరూ ఆపలేరు.. ఆమెను ఎవరూ కాపాడలేరని పేర్కొన్నారు.
పూర్తిగా చదవండి..కవిత జైలుకే.. కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు!
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ ఖాయమని సంచలన వ్యాఖ్యలు చేశారు కేంద్ర మంత్రి అశ్విన్ కుమార్ చౌబే. సీఎం కేసీఆర్ తెలంగాణను మందు బాబుల తెలంగాణగా మార్చారు అని మండిపడ్డారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్ను రద్దు చేస్తామని అన్నారు.
Translate this News: