Delhi Air Pollution: దేశ రాజధానికి ఢిల్లీలో వాయు కాలుష్యం కోరలు చాస్తుంది. గత కొన్ని రోజులుగా ఢిల్లీలో గాలి నాణ్యత కనిష్ట స్థాయికి పడిపోతుంది. గాలి పీల్చుకోడానికి కూడా అక్కడి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. శ్వాసకోశ సమస్య భారినపడే వారి సంఖ్య కూడా పెరుగుతున్నట్లు కొన్ని వార్త కథనాలు పేర్కొంటున్నాయి. దేశరాజధానిలో గాలి నాణ్యతను పెంచేందుకు అక్కడి ఆప్ సర్కార్ పలు ఆంక్షలు పెట్టింది. ఇటీవలే స్కూళ్లకు, కాలేజీలకు ఈ నెల 10వ తేదీ వరకు సెలవులను ప్రకటించింది.
పూర్తిగా చదవండి..విద్యార్థులకు GOOD NEWS.. సెలవులు పెంపు!
దేశరాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం పెరగడంతో అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్కూళ్లకు శీతాకాలం సెలవులను ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో నవంబర్ 9 నుంచి 18 వరకు ఢిల్లీలో పాఠశాలలు మూతపడనున్నాయి.
Translate this News: