అధిక రక్తపోటు (హైబీపీ) ఉన్నట్లు తేలితే చాలామంది చీటికీ మాటికీ నొప్పి మందులు వాడుతుంటారు. కొందరైతే వైద్యని సలహాలు, సూచనలు లేకుండానే మెడికల్ షాప్కు వెళ్లి మాత్రలు తెచ్చుకొని మింగేస్తుంటారు. అయితే ఇలా నొప్పి మందులతో ఛాతిమంట, కడుపు నొప్పి, జీర్ణాశయంలో పుండ్లు రావడం లాంటి రకరకాల దుష్ప్రభావాలు వస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఎవరైనా గానీ ఇలా చీటికీ మాటికీ నొప్పి మందులను వాడటం సరికాదు. ముఖ్యంగా అధిక రక్తపోటు ఉన్నవారు వీటిపట్ల జాగ్రత్తగా ఉండాలి. నొప్పి మందులు రక్తపోటును పెంచే ప్రమాదం కూడా ఉంది. హైబీపీ ఉన్నవారు రక్తపోటును నియంత్రణలో ఉంచుకోవడం చాలా ముఖ్యం. లేకపోతే పక్షవాతం, గుండెపోటు లాంటి తీవ్ర అనర్థాలకు దారితీస్తుంది.
పూర్తిగా చదవండి..High BP: హైబీపీ ఉందా ? తరచూ నొప్పి మందులు వాడుతున్నారా ? ప్రమాదంలో పడ్డట్లే
హైబీపీ ఉన్నవాళ్లలో చాలామంది నొప్పి మందులను చీటికీ మాటికీ వాడుతుంటారు. ఇలా చేయడం అస్సలు మంచిది కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇలా నొప్పి మందులు తరుచుగా వాడితే ఛాతి మంట, గుండెపోటు, పక్షవాతం లాంటి దుష్ప్రభావాలు వస్తాయంటున్నారు. ఇందుకోసం వైద్యుల సలహా తీసుకోవాలని చెబుతున్నారు.
Translate this News: