ప్రస్తుతం స్కిల్ డెవలప్మెంట్ కేసులో మధ్యంతర బెయిల్ మీద బయటకు వచ్చిన చంద్రబాబు..ఇన్నర్ రింగ్ కేసులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ వేశారు. ఈ రోజు దాని మీద ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ పిటిషన్ మీద ఇంతకు ముందు విచారణ జరిగింది. అప్పుడు చంద్రబాబుకు ఇవాల్టి వరకు అంటే నవంబర్ 7వరకు అరెస్ట్ చేయ్యదని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది హైకోర్టు. విచారణ దశలో ఉన్న పిటి వారెంట్ పై ఇవాళ్టి వరకు హైకోర్టు స్టే ఇచ్చింది. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో విచారణకు బాబు సహకరిస్తారని గత విచారణలో చంద్రబాబు తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ఈ నేపథ్యంలో మధ్యంతర ఉత్తర్వుల సమయం నేటితో ముగిసింది. దీని మీద ఇవాళ వాదనలు జరిగాయి. ఈ కేసును కోర్టు ఈ నెల 22కు వాయిదా వేసింది.
పూర్తిగా చదవండి..Chandrababu:ఐఆర్ఆర్ కేసులో బాబు మధ్యంతర బెయిల్ పై విచారణ వాయిదా
ఇన్నర్ రింగ్ రోడ్ కేస్లో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ మీద నేడు హై కోర్ట్ లో విచారణ జరిగింది. ఈ నెల 22కి ఈ కేసు విచారణను వాయిదా వేసింది ఏపీ హైకోర్టు.
Translate this News: