Ponguleti Srinivas Reddy: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. ఖమ్మం(Khammam) జిల్లాలో పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్(Congress) అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఆయన తరఫున సోదరుడు ప్రసాద్ రెడ్డి పాలేరు రిటర్నింగ్ అధికారికి నామినేషన్ సమర్పించారు. అనుచరులతో కలిసి భారీగా ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. పొంగులేటితో పాటు.. ఆయన అనుచరులైన పాయం వెంకటేశ్వర్లు పినపాక నియోజకవర్గానికి, కోరం కనకయ్య ఇల్లందు నియోజకవర్గానికి నామినేషన్ దాఖలు చేశారు. అయితే, పొంగులేటి నామినేషన్ పత్రాల్లో పేర్కొన్న ఆస్తుల వివరాలు ఇప్పుడు హైలెట్గా నిలుస్తున్నాయి. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మొత్తం ఆస్తి రూ. 440.23 కోట్లు ఉందని అఫిడవిట్లో పేర్కొన్నారు.
పూర్తిగా చదవండి..Telangana Elections: పొంగులేటి శ్రీనివాస్ ఆస్తి ఎంతో తెలుసా.. లెక్కలు చూస్తే కళ్లు తేలేస్తారు..!
Translate this News: