కోర్టులో హియరింగ్ జరుగతున్నప్పుడు జడ్జిని మైలార్డ్, యువర్ లార్డ్ షిప్ అని సంభోదిస్తంటారు. బ్రిటీష్ వాళ్ళు ప్రవేశపెట్టిన ఈ పద్ధతిని ఇప్పటికీ కొనసాగిస్తున్నారు మన లాయర్లు. కానీ ఇది ఒక సుప్రీంకోర్టు జడ్జికి చాలా విసుగు కలిగించింది. అందుకే ప్లీజ్ నన్ను మూలార్డ్ అని పిలవొద్దు అంటూ రిక్వెస్ట్ చేశారు జస్టిస్ పీఎస్ నరసింహ. అలా అంటుంటే వినడానికి చాలా ఇబ్బందిగా ఉందని చెప్పారు. దానికి బదులుగా సర్ అని పిలవొచ్చు కదా అని బతిమాలుకున్నారు. ఇలా అనడం ఆపేస్తే, నా వేతనంలో సగం మీకిచ్చేస్తా అని జస్టిస్ పీఎస్ నరసింహ పేర్కొన్నారు. బుధవారం జస్టిస్ ఏఎస్ బొపన్నతో కలిసి ఆయన ఓ కేసు విచారణలో పాల్గొన్నారు.
పూర్తిగా చదవండి..Supreme court:ప్లీజ్ నన్ను మైలార్డ్ అని పిలవకండి…
మైలార్డ్, యువర్ లార్డ్ షిప్స్ అని దయచేసి నన్ను పిలవొద్దు అంటున్నారు సుప్రీంకోర్టు న్యాయమూర్తి. అలా అనడం ఆపేస్తే నా జీతంలో సగం మీకు ఇచ్చేస్తానంటూ వేడుకున్నారు జస్టిస్ పీఎస్ నరసింహ.
Translate this News: