స్కిల్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు మధ్యంతర బెయిల్ లో మరికొన్ని అదనపు షరతుల విషయంలో సీఐడీ అనుబంధ పిటిషన్ వేసింది. దీని మీద హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. కొత్త విషయాలు చెప్పొద్దని…గతంలో ఇచ్చిన ఆదేశాలనే కొనసాగించాలని స్పష్టం చేసింది. చంద్రబాబు కార్యకలాపాల పరిశీలనకు ఇద్దరు డీఎస్పీలను పెట్టాలన్న సీఐడీ అభ్యర్థనను కూడా హైకోర్టు తిరస్కరించింది. అయితే చంద్రబాబు ర్యాలీలో పాల్గొనకూడదని, ఈ కేసుకు సంబంధించి మీడియాలో ఎక్కడ మాట్లాడకూడదని అన్న షరతులను మాత్రం తప్పనిసరిగా పాటించాలని మరోసారి కోర్టు స్పష్టం చేసింది.
పూర్తిగా చదవండి..AP high court:చంద్రబాబు మధ్యంతర బెయిల్ అదనపు షరతుల పిటిషన్ కొట్టేసిన హైకోర్టు
స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో చంద్రబాబుకు మంజూరు చేసిన మద్యంతర బెయిల్ షరతులు పెంచాలంటూ సిఐడి దాఖలు చేసిన అనుబంధ పిటిషన్ పై ఈరోజు ఏపీ హైకోర్టు తీర్పు ఇచ్చింది. గతంలో ఇచ్చిన షరతుల్ని కొనసాగించాలంటూ హైకోర్టు ఆదేశించింది.
Translate this News: