తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల యింది. ఈరోజు నుంచి నవంబర్ 10వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. ఇక ప్రచారం ఎప్పటి నుంచో జరుగుతోంది. మరోవైపు ఎలక్షన్ ఏర్పాట్లను కూడా చేసేస్తున్నారు. నవంబర్ 30న రాష్ట్రంలో 119 నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు చేస్తారు. పోలింగ్ ప్రక్రియ మొత్తం ఈవీఎంల ద్వారానే నిర్వహించనున్నారు. అయితే పోస్టల్ బ్యాలెట్ల ద్వారా ఓట్లు వేయాలనుకుంటే మాత్రం ముందుగానే దరఖాస్తు చేసుకోవాలని చెబుతున్నారు ఎన్నికల నిర్వహణాధికారులు. ఈ రోజు నుంచి నవంబర్ 7వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరిస్తామని చెబుతున్నారు.
పూర్తిగా చదవండి..Telangana elections:నేటి నుంచే పోస్టల్ ఓటుకు దరఖాస్తు..ఎవరెవరు చేసుకోవచ్చంటే..
నవంబర్ 30న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగనుంది. ఇందులో పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు వేయాలనుకునేవారు మాత్రం ఈరోజు నుంచి 7వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
Translate this News: