ఇజ్రాయెల్-హమాస్ మిలిటెంట్ల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ఇంకా కొనసాగుతున్నాయి. హమాస్ చేసిన మెరుపు దాడులకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ గాజా ప్రాంతంపై దాడులు చేస్తూనే ఉంది. ఇప్పటికే ఈ దాడుల్లో వేలాది మంది ప్రాణాలు కోల్పోగా ఆ సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఈ దాడులను ఆపేయాలంటూ ప్రంపంచ దేశాలు ఇజ్రాయెల్కు సూచిస్తున్నాయి. తాజాగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా ఈ ఘర్షణలకు తాత్కాలిక విరామం ఇవ్వాలంటూ పిలుపునిచ్చారు. మిన్నియాపొలిస్లో నిధుల సేకరణ కోసం నిర్వహించిన కార్యక్రమంలో జో బైడెన్ పాల్గొన్నారు. అక్కడున్న ఓ వ్యక్తి.. ‘మీరు ఇప్పుడే కాల్పుల విరమణకు పిలుపునివ్వాలంటూ బిగ్గరగా అరిచారు. దీనికి స్పందించిన బైడెన్ విరామం అవసరమని భావిస్తున్నానని.. బందీలను బయటకు తీసుకొచ్చేందుకు సమయం ఇవ్వాలని అన్నారు.
పూర్తిగా చదవండి..Israel-Hamas war: ఇక చాలు ఆపండి.. ఇజ్రాయెల్-హమాస్కు బైడెన్ పిలుపు
ఇజ్రాయెల్-హమాస్ మధ్య భీకర దాడులు జరుగుతున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఘర్షణలకు తాత్కాలిక విరామం ఇవ్వాలంటూ పిలుపునిచ్చారు. బందీలను బయటకు తీసుకొచ్చేందుకు సమయం ఇవ్వాలంటూ పేర్కొన్నారు.
Translate this News: