కేసీఆర్ ఆయన ఫ్యామిలీ తెలంగాణను దోచుకోవడానికి కాళేశ్వరం ప్రాజెక్టును ఏటీఎమ్ లా వాడుకున్నారని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈరోజు మేడిగడ్డ బ్యారేజీని సందర్శించిన ఆయన ఎక్కడెక్కడో పగుళ్ళు వచ్చాయో, బ్రిడ్జి కుంగిపోయిందో స్వయంగా చూసి తెలుసుకున్నారు. చాలా పిల్లర్లకు పగుళ్ళు వచ్చాయని…అవినీతి మొత్తం అక్కడే కనిపిస్తోందని రాహుల్ మండిపడ్డారు. అంత డబ్బులు ఖర్చు పెట్టి ఇంత నాసిరకమైన ప్రాజెక్టను నిర్మించారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
పూర్తిగా చదవండి..Rahul Gandhi:మేడిగడ్డ బ్యారేజిని సందర్శించిన రాహుల్
కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ కొంత సేపటి క్రితం మేడిగడ్డ బ్యారేజీని సందర్శించారు. వంతెన మీద పగుళ్ళు చాలా ఎక్కువ అయ్యాయని...కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్లో అవినీతి విపరీతంగా జరిగిందని ఆయన మండిపడ్డారు.
Translate this News: