తెలంగాణ నుంచి బీజేపీ సీనియర్ నేతలు ఒక్కొక్కరే వెళ్ళిపోతున్నారు. ఆ పార్టీ మేనిఫెస్టో కమిటీ సభ్యులు వివేక్ కూడా నిన్న పార్టీకి రాజీనామా చేసి వెళ్ళిపోయారు. అలాగే కాంగ్రెస్ లో కూడా చేరిపోయారు. అంతకు ముందు బీజేపీ స్క్రీనింగ్ కమిటీ సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వెళ్ళిపోయారు. ఆయన లేకుండానే బీజేపీ అభ్యర్ధుల లిస్ట్ వెలువడింది. ఇప్పుడు వివేక్ వంతు. బీజేపీ అభ్యర్ధులను అయితే ప్రకటిస్తోంది కానీ… మేనిఫెస్టో గురించి మిత్రం ఇప్పటి వరకు ఊసెత్తడం లేదు. ఇప్పుడు ఆ కమిటీలోని ఛైర్మన్ వివేక్ పార్టీ నుంచి బయటకు వచ్చేశారు. దీంతో బీజేపీ మేనిఫెస్టో అసలు వస్తుందా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి.
పూర్తిగా చదవండి..Telangana BJP: కాంగ్రెస్ లో జంప్ అయిన వివేక్.. మరి బీజేపీ మేనిఫెస్టో సంగతేంటి?
మరో 28 రోజుల్లో తెలంగాణ ఎన్నికలు జరగనున్నాయి. పార్టీలన్నీ అభ్యర్ధులు, మేనిఫెస్టోలు రెడీగా ఉన్నాయి ఒక్క బీజేపీ తప్ప. దానికి తోడు ఇప్పుడు వివేక్ పార్టీ నుంచి వెళ్ళిపోవడంతో అసలు మేనిఫెస్టో వస్తుందా రాదా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.
Translate this News: