BJP Laxman Interview: ఓట్ల కోసం తాయిలాలు ఇచ్చే పార్టీ మాది కాదు. పేదల కన్నీరు తుడిచే పార్టీ మాది అంటున్నారు తెలంగాణ బీజేపీ సీనియర్ నేత కె.లక్ష్మణ్. మోదీ (Modi) నిజాయితీ, ప్రజల కోసం ఆయన చేస్తున్న పనులను అందరూ గమనిస్తున్నారని…ఆ నమ్మకంతోనే జనం బీజేపీకి ఓటు వేస్తారని అన్నారు. ఈసారి తెలంగాణలో (Telangana Elections) తమ పార్టీ గట్టి పోటీనిస్తుందని తెలిపారు. అదేవిధంగా పార్టీ నుంచి నేతలు వెళ్ళిపోవడం చాలా సహజమని లక్ష్మణ్ కొట్టిపారేశారు. దాన్ని అంత సీరియస్ గా తీసుకోనక్కర్లేదని అన్నారు. వాళ్ళందరూ పాసింగ్ క్లౌడ్స్ లాంటి వారని వ్యాఖ్యానించారు. బీజెపీ నుంచి వెళ్ళిపోతున్నవారితో పార్టీకి ఏమీ సంబంధం లేదు. అన్ని పార్టీల్లో ఇది జరగుతోంది. కొంత మంది వెళ్ళిపోతే మరి కొంత మంది వచ్చి చేరుతున్నారన్నారు. బీజెపీ (BJP) మొదట ప్రకటించిన లిస్ట్ లో చాలా మంది కొత్తవాళ్ళే ఉన్నారు. మేము అందరికీ సమన్యాయం జరిగేట్టు చూస్తున్నాం. బాబూ మోహన్, విజయశాంతి వంటి వారి విషయాల్లో కూడా అధిష్టానం సరైన నిర్ణయం తీసుకుంటుందని లక్ష్మణ్ తెలిపారు. సెకండ్ లిస్ట్ నవంబర్ 1కు వస్తుందని చెప్పారు.
పూర్తిగా చదవండి..BJP Laxman Interview: జంప్ జిలానీలు పాసింగ్ క్లౌడ్స్ లాంటివారు-కే.లక్ష్మణ్
ఈసారి తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ కచ్చితంగా గెలిచి చూపిస్తుందని నమ్మకంగా చెబుతున్నారు ఆ పార్టీ సీనియర్ నేత కే. లక్ష్మణ్. పూర్తి స్థాయిలో ఎన్నికల్లోకి వస్తున్నామని..ఈసారి ఆశ్చర్యకరమైన ఫలితాలు వస్తాయని ఆయన చెప్పారు. పార్టీలోంచి వెళ్ళిపోయే వారందరూ పాసింగ్ క్లౌడ్స్ లాంటి వారని లక్ష్మణ్ వ్యాఖ్యానించారు.
Translate this News: