తెలంగాణ ఎన్నికలకు (Telangana Elections 2023) సంబంధించి మరో రెండు సర్వేలు (Telangana Election Survey) విడుదలయ్యాయి. ఆత్మసాక్షి, రాజనీతి సంస్థలు తమ సర్వే ఫలితాలను తాజాగా విడుదల చేశాయి. ఈ రెండు సంస్థలు కూడా బీఆర్ఎస్ పార్టీ (BRS Party) మరో సారి అధికారంలోకి వస్తుందని తమ సర్వే ఫలితాల్లో తేల్చిచెప్పాయి. ఆత్మసాక్షి సంస్థ బీఆర్ఎస్ పార్టీ 64-70 స్థానాల్లో విజయం సాధిస్తుందని తెలిపింది. కాంగ్రెస్ పార్టీ (TS Congress) 37-43 స్థానాలకే పరిమితం అవుతుందని అంచనా వేసింది. బీజేపీ 5-6 స్థానాల్లో, ఎంఐఎం 6-7 స్థానాల్లో విజయం సాధిస్తుందని వెల్లడించింది. మరో 6 స్థానాల్లో గట్టి పోటీ ఉంటుందని తమ సర్వేలో తేలిందని ఆత్మ సాక్షి సంస్థ తెలిపింది.
ఇది కూడా చదవండి: Telangana Elections: 13 సమస్యాత్మక నియోజకవర్గాల్లో సాయంత్రం 4 వరకే పోలింగ్
TS Elections: మళ్లీ బీఆర్ఎస్ దే అధికారం.. ఆత్మసాక్షి, రాజనీతి సర్వేల లెక్కలివే!
రానున్న తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మరో సారి అధికారం దక్కించుకుని హ్యాట్రిక్ కొడుతుందని తమ సర్వేల్లో తేలిందని ఆత్మసాక్షి, రాజనీతి సంస్థలు తెలిపాయి. ఆత్మసాక్షి సర్వే బీఆర్ఎస్ పార్టీకి 64-70 సీట్లు వస్తాయని తెలపగా.. రాజనీతి సర్వే మాత్రం 77 సీట్లు వస్తాయని అంచనా వేసింది.
Translate this News: