నవంబరు మాసంలో 19 నుంచి 24 తేదీల మధ్య మంచి ముహూర్తాలు ఉండటంతో వేలాది జంటలు ఒక్కటి కానున్నారు. కేవలం వారం రోజుల వ్యవధిలోనే వేలాది వివాహాలు జరిగే వీలుందని పురోహితులు చెప్తున్నారు. అయితే ఎన్నికల పుణ్యమా అని వివాహ వేడుకలు భయం భయంగా జరుపుకోవాల్సిన అగత్యం ఏర్పడింది. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటిక నుంచి పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. రూ.50 వేలకు మించి నగదు దొరికితే చాలు వెంటనే సీజ్ చేసేస్తున్నారు. ఇప్పటికే వ్యాపారులు తమ రోజు వారీ కార్యకలాపాలకు వినియోగించాల్సిన నగదు సీజ్ అవుతుండటంతో వారంతా లబోదిబో అంటున్నారు.
పూర్తిగా చదవండి..ఎన్నికల దెబ్బకు పెళ్లి బాజాలు మోగే ఇళ్లల్లో ఆందోళన..ఎందుకంటే..!!
ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చిందని, తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు పెళ్లిల్లు కుదుర్చుకున్న ఇళ్లల్లో కష్టాలను కొని తెస్తున్నాయి. అసలే పెళ్లిళ్ల సీజన్ మరోవైపు ఎన్నికల వేడి ప్రారంభం అయిపోయింది. దీంతో పెళ్లిళ్లు జరగాల్సిన ఇళ్లల్లో ఆందోళన మొదలైంది. ఎందుకంటే షాపింగ్ కోసం నగదు తీసుకెళ్తుంటే పోలీసులు తనిఖీల పేరుతో డబ్బును స్వాధీనం చేసుకుంటున్నారు. దీంతో వ్యాపారులు, అలాగే సామాన్యులు లబోదిబో మంటున్నారు.
Translate this News: