KTR Fires on Congress Leaders: నోటిఫికేషన్ తేదీ నుంచి ఎన్నికల వరకు వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి నగదు బదిలీ ఆపేలా చర్యలు తీసుకోవాలని ఈసీకి కాంగ్రెస్ (Congress) పార్టీ వినతి పత్రం అందించిన విషయం తెలిసిందే. ఈ అంశంపై అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల నడుమ మాటల తూటాలు పేలుతున్నాయి. ముఖ్యంగా రైతు బంధు పథకాన్ని (Rythu Bandhu Scheme) ఆపి రైతులను ఇబ్బంది పెట్టాలని కాంగ్రెస్ చూస్తోందని బీఆర్ఎస్ నేతలు (BRS Leaders) ఆరోపిస్తున్నారు. అయితే.. కాంగ్రెస్ నేతలు మాత్రం రైతు బంధు నిధులను ఇంకా ముందుగానే ఇవ్వాలని కోరుతున్నామని వివరణ ఇస్తున్నారు. ఒక వేళ కేసీఆర్ (CM KCR) చెల్లింపులు చేయకపోతే.. నెల రోజుల్లో తాము అధికారంలోకి వచ్చిన వెంటనే రైతు బంధు కింద ఎకరాకు రూ.15 వేలు.. పింఛన్ రూ.4 వేలు ఇస్తామన్నారు రేవంత్ రెడ్డి.
ఇది కూడా చదవండి: TPCC press meet- ఆ అధికారులను వెంటనే తొలగించండి: రేవంత్ రెడ్డి సంచలన డిమాండ్
TS Elections 2023: మంచి నీళ్లు, 24 గంటల కరెంట్ కూడా ఆపెయ్యాలా?- కాంగ్రెస్ పై కేటీఆర్ ఫైర్
రైతు బంధు పథకంపై ఎన్నికల కమిషన్ కు కాంగ్రెస్ పార్టీ వినతి పత్రం అందించిన విషయంపై విమర్శలు, ప్రతివిమర్శలు చోటు చేసుకుంటున్నాయి. కాంగ్రెస్ పార్టీ నేతలు చివరికి.. 'ఇంటింటికి మంచినీళ్లు ... ఇరవై నాలుగు గంటల కరెంటు కూడా ఆపెయ్యమంటరేమో ?' అని ఫైర్ అయ్యారు కేటీఆర్.
Translate this News: