అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో తెలంగాణ బీజేపీలో కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. ఇప్పటికే పార్టీలన్నీ అభ్యర్థులను ప్రకటించి ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి. కానీ బీజేపీలో మాత్రం ఇద్దరు అగ్రనేతల మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరుకుంది. తమ అనుచరులకే సీట్లు కేటాయించాలంటూ ఈటెల రాజేందర్, బండి సంజయ్ లు పట్టుపడుతున్నారు. దీంతో కొన్ని సీట్లు పెండింగ్ లోనే ఉన్నాయి. ఎవరికి వారే తమ అనుచురులకు సీట్ల కేటాయించాలంటూ మొండికేయడం అధిష్టానానికి తలనొప్పిగా మారింది. నేతల మధ్య పోరుతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని వేములవాడు, హుస్నాబాద్ సీట్లపై ఇంకా స్పష్టత రాలేదు. హుస్నాబాద్ టికెట్ ను తన గురువు కుమారుడు బొమ్మ శ్రీరామ్ చక్రవర్తికి ఇవ్వలంటూ బండి సంజయ్ పట్టుబడుతున్నారు. అదే టికెట్ ను తన అనుచరుడు జేఎస్ఆర్ కు ఇవ్వలంటూ ఈటెల రాజేందర్ భీష్మించికూర్చున్నారు. అటు వేములవాడ టికెట్ ను మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు కుమారుడు వికాస్ రావు కేటాయించాలని బండి సంజయ్ డిమాండ్ చేస్తుంటే…ఇదే టికెట్ ను తన అనుచరాలు తులా ఉమాకు ఇవ్వాల్సిందేనంటూ ఈటెల రాజేందర్ మొండికేస్తున్నారు. దీంతో ఏటూ తేల్చుకోలేక బీజేపీ పెద్దలు ఇద్దరు నేతలు మధ్య సయోధ్య కుదిర్చే పనిలో నిమగ్నమయ్యారు.
పూర్తిగా చదవండి..Bandi vs Etela: సీట్ల కోసం నేతల మధ్య ఆధిపత్య పోరు..తలపట్టుకున్న అధిష్టానం..!!
తెలంగాణ బీజేపీలో కొత్త సమస్య తలెత్తింది. ఇద్దరు అగ్రనేతల మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరుకుంది. ఈ ఇద్దరి నేతల మధ్య సయోధ్య కుదర్చలేక అధిష్టానం తలపట్టుకుంటోంది. ఎమ్మెల్యే ఈటెల రాజేందర్, బండి సంజయ్లు పలు చోట్ల వారి అనుచరులకే టికెట్లు కేటాయించాలంటూ పట్టుపడుతున్నారు. దీంతో కొన్ని సీట్లు అలాగే పెండింగ్లో ఉన్నాయి. ఎన్నికల సమయం దగ్గరపడుతున్న సమయంలో ఇలా ఇద్దరు అగ్రనేతలు మొండికేయడం బీజేపీ పెద్దలకు తలనొప్పిగా మారింది
Translate this News: