Narsapur BRS Candidate Sunitha Laxma Reddy: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మొదటి నుంచి దూకుడుగా ఉంది బీఆర్ఎస్ పార్టీ(BRS). తొలి విడత పేరుతోనే ఏకంగా 115 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారు ఆ పార్టీ అధినేత కేసీఆర్(CM KCR). అయితే, 4 స్థానాలను మాత్రం సస్పెన్స్లో పెట్టిన గులాబీ దళపతి.. ఇప్పుడు ఆ నియోజకవర్గాల అభ్యర్థులను కూడా కన్ఫామ్ చేస్తున్నారు. తాజాగా మెదక్(Medak) జిల్లాలోని నర్సాపూర్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్. నర్సాపూర్ బీఆర్ఎస్ అభ్యర్థిగా సునీతా లక్ష్మారెడ్డిని ప్రకటించారు. ఆ మేరకు ఆమెకు బుధవారం నాడు బీఫామ్ కూడా అందజేశారు. అయితే, ప్రస్తుత నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డికి మెదక్ ఎంపీ స్థానం కేటాయించాలని పార్టీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. దాంతో.. ఆయన స్థానంలో సునీత లక్ష్మారెడ్డి పేరును కన్ఫామ్ చేశారు గులాబీ బాస్. ఇక ఎమ్మెల్యే మదన్ రెడ్డి సమక్షంలో సీఎం కేసీఆర్ ఆమెకు నర్సాపూర్ బీఫామ్ను అందజేశారు.
పూర్తిగా చదవండి..Telangana Elections: నర్సాపూర్ బీఆర్ఎస్ అభ్యర్థి ఖరారు.. సునీతా లక్ష్మారెడ్డికే బీఫామ్ కన్ఫామ్..
మెదక్ జిల్లాలోని నర్సాపూర్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్. నర్సాపూర్ బీఆర్ఎస్ అభ్యర్థిగా సునీత లక్ష్మారెడ్డిని ప్రకటించారు. ఆ మేరకు ఆమెకు బుధవారం నాడు బీఫామ్ కూడా అందజేశారు. అయితే, ప్రస్తుత నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డికి మెదక్ ఎంపీ స్థానం కేటాయించాలని పార్టీ నిర్ణయించినట్లు తెలుస్తోంది.
Translate this News: