కాంగ్రెస్ రెండో జాబితాలో చోటు కోసం అభ్యర్థుల నుంచి పోటీ చాలా ఎక్కువగా ఉంది. దీని మీద కేంద్ర కాంగ్రెస్ ఎన్నికల కమిటీ కసరత్తు చేస్తోంది. ఢిల్లీలో సమావేశమయిన కమిటీ ఈరోజు సెకండ్ లిస్ట్ ను తయారు చేసి రాత్రికి విడుదల చేస్తుందని తెలుస్తోంది. సోనియాగాంధీ మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్, రేవంత్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క సమావేశంలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సారి లిస్ట్ ప్రిపరేషన్ కు రాహుల్ గాంధీ లేరని చెబుతున్నారు.సుమారు 30 మందితో కాంగ్రెస్ రెండో జాబితా విడుదల చేయనుంది. మొత్తం లిస్ట్ ఇప్పుడే ప్రకటిస్తారని ప్రచారం జరిగింది. కానీ అలా కాకుండా ఈ రోజు కేవలం 30 మందితో మాత్రమే సెకండ్ లిస్ట్ ప్రకటిస్తారని తెలుస్తోంది. దీన్ని బట్టి మూడు నాలుగు జాబితాలు కూడా ఉందని తెలుస్తోంది.నవంబర్ మూడు నాటికి చివరి జాబితా ప్రకటించొచ్చని తెలుస్తోంది.
పూర్తిగా చదవండి..TS Congress: ఈ రాత్రికే కాంగ్రెస్ సెకండ్ లిస్ట్.. కానీ ఓ బిగ్ ట్విస్ట్?
తెలంగాణ కాంగ్రెస్ రెండో జాబితా విడుదలకు ఆ పార్టీ హైకమాండ్ కసరత్తు ప్రారంభించింది. ఈ రోజు జరుగుతున్న కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశానికి సోనియాగాంధీ మల్లికార్జున ఖర్గే , కేసీ వేణుగోపాల్, రేవంత్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క హాజరయ్యారు. ఈ రోజు రాత్రికి సెకండ్ లిస్ట్ ప్రకటించే అవకాశం ఉంది.
Translate this News: