ఎన్నికలు (Telangana Elections 2023) దగ్గర పడుతున్నా కొద్దీ తెలంగాణ రాజకీయాల్లో (Telangana Politics) వేగంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఎన్నికల్లో తెలంగాణలో ఎలాగైనా సత్తా చాటాలని భావిస్తున్న బీజేపీ అందుకు తగిన వ్యూహాలను రచిస్తోంది. ఈ మేరకు ఆ పార్టీ హైకమాండ్ రంగంలోకి దిగింది. ఇక్కడ జరుగుతున్న పరిణామాలను జాగ్రత్తగా పరిశీలిస్తోంది. తాజాగా బీజేపీ అధిష్టానం నుంచి జనసేన నేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) పిలుపు అందింది. దీంతో ఆయన హుటాహుటిన ఢిల్లీ బయలుదేరినట్లు సమాచారం. ఈ రోజు రాత్రి కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో పవన్ సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో బీజేపీ-జనసేన పొత్తుపై వీరి మధ్య చర్చలు జరిగే అవకాశం ఉంది. దీంతో పాటు ఆంధ్రలో పొత్తుల అంశంపై కూడా వీరు చర్చిస్తారని ఇరు పార్టీల నేతలు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: CM KCR: ఫలించిన కేసీఆర్ వ్యూహం.. రోడ్ రోలర్ సింబల్ కు చెక్.. ఎలాగో తెలుసా?
Telangana Elections: ఢిల్లీకి స్పెషల్ ఫ్లైట్ లో పవన్, కిషన్ రెడ్డి.. పొడవనున్న బీజేపీ-జనసేన పొత్తు?
తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకునే అవకాశం ఉంది. జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఈ రోజు స్పెషల్ ఫ్లైట్లో కిషన్ రెడ్డితో కలిసి ఢిల్లీకి వెళ్లారు. ఈ రోజు సాయంత్రం అమిత్ షా, జేపీ నడ్డాను ఆయన కలిసి తెలంగాణ ఎన్నికల్లో పొత్తులపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.
Translate this News: