ఎట్టకేలకు రెండు రోజులుగా జోరుగా సాగుతున్న ప్రచారానికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajagopal Reddy) తెరదించారు. బీజేపీ (BJP) రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అదే సమయంలో కాంగ్రెస్ లో చేరనున్నట్లు కూడా వెల్లడించారు. ఎల్లుండి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ లో చేరనున్నట్లు తెలుస్తోంది. రాహుల్ గాంధీ సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని గాంధీ భవన్ వర్గాలు చెబుతున్నాయి. అయితే.. రాజగోపాల్ రెడ్డి ఈ ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే అంశంపై తీవ్ర చర్చ సాగుతోంది. మునుగోడు టికెట్ కోసం ఆయన పట్టుబట్టినట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: Big Breaking: బీజేపీకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా
TS Congress: ఎల్లుండే కాంగ్రెస్ లోకి రాజగోపాల్ రెడ్డి.. పోటీ ఎక్కడి నుంచంటే?
బీజేపీకి రాజీనామా ప్రకటించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ నెల 27న రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరనున్నారు. మరో సారి మునుగోడు నియోజకవర్గం నుంచే ఆయన బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు కాంగ్రెస్ హైకమాండ్ నుంచి ఆయనకు గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు సమాచారం.
Translate this News: