కర్నూలు జిల్లా దేవరగట్టులో బన్నీ ఉత్సవం జరిగింది. సంప్రదాయాల్లో భాగంగా కర్రలు గాల్లోకి లేచాయి. డిర్ర్, గోపరాక్ అనే శబ్దాలతో దేవరగట్టు దద్దరిల్లింది. పోలీసులు వద్దని చెప్పినా వినలేదు.. యథావిధిగా కర్రల సమరం కొనసాగింది. దేవరగట్టుపై వెలసిన మాళ మల్లేశ్వరస్వామిని రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర ప్రాంతాల ప్రజలు భక్తిభావంతో ఆరాధిస్తారు. ఉత్సవాలకు ముందు వచ్చే అమావాస్య నుంచి నెరిణికి, నెరిణికి తండా, కొత్తపేట గ్రామాల భక్తులు దీక్షలు చేపడతారు. ఉత్సవ విగ్రహాలకు కంకణధారణ చేసే గ్రామస్తులు బన్నీ ఉత్సవాలు ముగిసేంతవరకు ఎంతో నిష్టగా ఉంటారు. కొండపై నుంచి విగ్రహాలు తిరిగి నెరిణికి గ్రామానికి చేరేంతవరకు మద్యం, మాంసం ముట్టరు. భార్యభర్తలు ఒకే మంచంపైన కూడా నిద్రపోరు. తరతరాలుగా ఈ ఆనవాయితీని పాటిస్తున్నామని గ్రామస్థులు చెబుతున్నారు.
పూర్తిగా చదవండి..Devaragattu festival:దేవరగట్టు సమరంలో వందమందికి గాయాలు
దేవరగట్టు మరొకసారి మారుమోగింది. తరతరాలుగా వస్తున్న కర్రల సమరంతో ఆ ప్రదేశం రణరంగంగా మారింది. భక్తిభావంతో చేసిన ఈ కర్రల ఫైట్ లో 100 మందికి పైగా గాయపడ్డారు. చెట్టు కొమ్మ విరిగి ఒక యువకుడు మరణించాడు. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.
Translate this News: