శ్రీలంకలో ఇటీవల ఆర్థిక సంక్షోభం నెలకొన్న సంగతి తెలిసిందే. ఆ సంక్షోభం నుంచి బయటపడేందుకు శ్రీలంక ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఆ దేశానికి ఆదాయం వచ్చేది ముఖ్యంగా పర్యాటక రంగం నుంచే. అయితే పర్యటకాన్ని మరింత ప్రోత్సహించాలనే ఉద్దేశంతో శ్రీలంక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్పాటుగా మరో ఏడు దేశాలకు చెందిన పర్యాటకులకు వీసా లేకుండానే టూరిస్టు ప్రదేశాల సందర్శనకు అనుమతివ్వాలని నిర్ణయం తీసుకుంది. ఇండియా, చైనా, జపాన్, ఇండోనేషియా, థాయ్లాండ్, రష్యా, మలేషియా దేశాలకు ఇది వర్తించనుంది. ఈ మేరకు శ్రీలంక కేబినెట్ నిర్ణయం తీసుకుందని.. ఆ దేశ విదేశీ వ్యవహారాల మంత్రి అలీ సబ్రీ పేర్కొన్నారు. వెంటనే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. వచ్చే ఏడాది మార్చి 31 వరకు ఈ పైలట్ ప్రాజెక్టు అమల్లో ఉంటుందని చెప్పారు.
పూర్తిగా చదవండి..Srilanka: టూరిస్టులకు గుడ్ న్యూస్.. ఇక నుంచి శ్రీలంకకు వెళ్లాలంటే వీసా అవసరం లేదు..
పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు శ్రీలంక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇండియాతో సహా ఏడు దేశాలకు వీసా లేకుండానే పర్యాటక ప్రదేశాల సందర్శనకు అనుమతి ఇవ్వనుంది. ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి వస్తుందని శ్రీలంక విదేశీ వ్యవహారాల మంత్రి అలీ సబ్రీ పేర్కొన్నారు. వచ్చే ఏడాది మార్చి 31 వరకు ఈ పైలట్ ప్రాజెక్టు అమల్లో ఉంటుందని చెప్పారు.
Translate this News: