తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) ఈ నెల 27న రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఆ రోజు సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న బీజేపీ భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నారు. అమిత్ షా సభకు భారీ ఏర్పాట్లు చేసేందుకు బీజేపీ నేతలు సిద్ధమవుతున్నారు. లక్ష మందితో సభను నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. వివేక్ వెంకటస్వామి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తదితరులు పార్టీని వీడతారంటూ సాగుతున్న ప్రచారంపై బీజేపీ అగ్రనేతలు అలర్ట్ అయినట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: TS Elections 2023: కేసీఆర్కు షాక్.. సీఎంపై పోటీకి 120మంది..!
TS Politics: తెలంగాణలో జనసేన-బీజేపీ పొత్తు.. అమిత్ షాతో పవన్ కల్యాణ్ భేటీకి ముహూర్తం ఖరారు!
ఈ నెల 27న అమిత్ షా తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ అమిత్ షా భేటీ కానున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ఎన్నికల్లో పొత్తులు, సీట్ల పంపకంపై వీరిద్దరి మధ్య చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Translate this News: