కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం (Karnataka Congress Government) అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఆ పార్టీ తెలంగాణ నేతల్లోనూ ఉత్సాహం పెరిగింది. ఇదే ఊపులో ఇక్కడ కూడా అధికారంలోకి వస్తామంటూ వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ఇచ్చిన హామీలను ఇక్కడ కూడా ఇచ్చేశారు హస్తం నేతలు. తమ ఉపన్యాసాల్లోనూ కర్ణాటక మోడల్ అంటూ చెప్పుకొస్తున్నారు. అయితే.. కర్ణాటకలో సిద్దరామయ్య సర్కార్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రైతులు పడుతున్నారని బీఆర్ఎస్ నేతలు కౌంటర్లు ఇస్తున్నారు. మీరు గెలిస్తే కరెంట్ కోసం కర్ణాటకలో మాదిరిగా రైతులు రోడ్డెక్కే పరిస్థితి తెస్తారంటూ ఫైర్ అవుతున్నారు.
ఇది కూడా చదవండి: Harish Rao: ‘ఆఫీసుల చుట్టూ తిరిగి లంచాలు ఇస్తే పని అయ్యేది’.. తెలంగాణ పాల పిట్ట కేసీఆర్!
KTR: కర్ణాటక వీడియోతో కాంగ్రెస్ పై కేటీఆర్ పంచ్ లు.. ముందుంది మొసళ్ల పండుగ అంటే ఇదేనేమో అంటూ..!
కరెంట్ రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ కర్ణాటకలోని ఓ గ్రామ రైతులు సబ్ స్టేషన్లో మొసలిని వదిలారు. ఈ వీడియోను మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. 'ముందుంది మొసళ్ల పండుగ అంటే ఇదేనేమో' అంటూ కాంగ్రెస్ నేతలపై సెటైర్లు వేశారు కేటీఆర్.
Translate this News: